‘కోర్ట్’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న యువ జంట హర్ష రోహన్ మరియు శ్రీదేవి ఆపళ్ళ కాంబినేషన్లో దర్శకుడు సతీష్ జివ్వాజి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘బ్యాండ్ మేళం’ థియేటర్ రిలీజ్కు ముందు మంచి ప్రమోషన్స్ జరుపుకుంది. అయితే థియేటర్లలో మాత్రం అనుకున్న స్థాయిలో రన్ కాలేదు.
ఇప్పుడు ఈ చిత్రం OTT లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ZEE5లో నేటి నుండి ఈ సినిమా వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ZEE5లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
‘బేబీ’, ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ ఫేమ్ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత మరియు నిర్మాత కోనా వెంకట్ నిర్మించారు.
