స్పృహలోకి వచ్చిన బ్యూటీ పద్మ…వెలుగులోకి వచ్చిన విషయాలు

beautician padma reveals crucial information

బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసు మిస్టరీగా మారింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా మరొకరు ఆసుపత్రిలో అచేతనంగా పడి ఉన్నారు. అయితే విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే పద్మ మాట్లాడే పరిస్థితికి చేరుకోవడంతో ఆమెను పోలీసులు మంగళవారం కొద్ది సమయం విచారించారు.

New twist in Beautician attack case

ఈ సందర్భంగా పద్మ పలు విషయాలు వెల్లడించింది. ఆమె మాటల ప్రకారం ఈ నెల 23వ తేదీ రాత్రి జరిగిన గొడవ జరగడం వలన పద్మను నూతనకుమార్‌ విచక్షణ రహితంగా కొట్టినట్లు ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అలాగే ఆమెపై జరిగిన హత్యాయత్నంలో నూతనకుమార్‌ ఒక్కడే ఉన్నాడని సుబ్బయ్య అనే మూడో వ్యక్తి ఎవరూ లేరని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నూతనకుమార్‌ తీవ్రంగా కొట్టిన దెబ్బలతో స్పృహ కోల్పోయాక్, తన కాళ్లు కట్టేసి, నోట్లో ప్లాస్టిక్‌ కవర్లు కుక్కి కత్తితో దాడి చేశాడని ఆమె పేర్కొంది.

Beautician Padma's lover found dead

అయితే కత్తిపోట్లతో విపరీతంగా రక్తం పోవటం, మెడపై తీవ్ర గాయం కావటంతో పద్మ ఎక్కువ సేపు మాట్లాడలేదని తెలుస్తోంది. అసలు హత్యాయత్నం రాత్రి నూతనకుమార్, పద్మ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా రాబట్టేందుకు యత్నించారు. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వారు మిన్నకుండిపోయారు.