బ్యూటీషియన్ ని కాళ్ళు చేతులు కట్టేసి నరికిన ఉన్మాది…!

The Legs Hands Are Cut Off And The Killing Of The Beautician

వివాహేతర సంబంధం మరో మహిళ ఉసురు తీసింది. ముందు వివాహం బెడిసికోట్టడంతో ఆయన నుండి దూరంగా ఉంటూ పిల్లలను చదివించుకుంటూ బ్యూటీ పార్లర్ నడుపుతోన్న సదరు మహిళ మరో వ్యక్తితో వివాహేతహర సంబంధం ఏర్పర్చుకుంది. ఇద్దరి మధ్యా ఏమయిందో ఏమో నిన్న తన ఇంటిలో కళ్ళు చేతులు కరెంట్ వైర్ తో కట్టివేయబడి కిరాతకంగా నరికివేయబడింది. కృష్ణా జిల్లాలో కలకలం ఏర్పుతున్న ఈ ఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు బాపులపాడుకు చెందిన పద్మ అనే మహిళ స్థానికంగా బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. భర్తతో విభేదాలు రావడంతో గత కొద్దికాలంగా పద్మ అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నూతన్ ప్రసాద్ అనే యువకుడితో ఆమెకు సంబంధం ఏర్పడింది.

BEAUTISIONS1

దీంతో వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే ఈ వివాహేతర సంబంధంపై పద్మ, ప్రసాద్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎప్పుడు చేసాడో తెలియదు కానీ ప్రసాద్ పద్మ కాళ్లు, చేతులను ఎలక్ట్రానిక్ మోటార్లకు వాడే వైర్ తో కదలకుండా కట్టేసి కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ఆ తర్వాత బయటనుంచి తలుపు వేసి వెళ్లిపోయాడు.పద్మ అరుపులను విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సదరు మహిళ పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధం విషయంలో అభిప్రాయభేదం తలెత్తడంతోనే ఈ దాడి జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

beautisions padma