సాహోలో మందిరాబేడీ

Mandira Bedi In Sahoo Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా సాహో…యూవీ క్రియేష‌న్స్ రూ. 150 కోట్ల‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి చిత్రీక‌రిస్తున్నారు. ఈ మూడు భాష‌ల‌తో పాటు మ‌ళ‌యాళం, క‌న్న‌డ‌లో్నూ  రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఓ ప్రాంతీయ చిత్రంలా కాకుండా…జాతీయ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా కు న‌టీన‌టుల్ని కూడా బాలీవుడ్ నుంచే ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ లీడింగ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ ను ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. సినిమాలో మ‌రికొన్ని కీల‌క‌పాత్ర‌ల కోసం జాకీష్రాఫ్‌, నీల్ నితిన్ ముఖేశ్‌, చుంకీ పాండే, టిన్నూ ఆనంద్ ను తీసుకున్నారు. ఇప్పుడు మ‌రో బాలీవుడ్ భామ‌కు  సాహోలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది.

 కొన్నేళ్ల క్రితం క్రికెట్ కామెంటేట‌ర్ గా సంచ‌ల‌నం సృష్టించి…ఇప్పుడు అడ‌పా ద‌డ‌పా హిందీ సినిమాల్లో క‌నిపిస్తున్న మందిరా బేడీ సాహోలో మెర‌వ‌నుంది. నెగ‌టివ్ రోల్ కోసం మందిరాబేడీని తీసుకున్న‌ట్టు స‌మాచారం. మొత్తానికి  సాహో సినిమా పుణ్య‌మాని  బాలీవుడ్‌, టాలీవుడ్ న‌టీన‌టులు క‌లిసి  ఒకే సినిమాలో క‌నిపించ‌నున్నారు. మామూలుగా ఇప్పుడు తెలుగు సినిమాల్లో ప‌ర‌భాష న‌టులే ఎక్కువ‌గా ఉంటున్నార‌న్న‌ది టాక్‌. అయితే హీరోయిన్‌, విల‌న్ పాత్ర‌ల్లో మాత్ర‌మే ఎక్కువ‌గా ప‌ర‌భాషా న‌టులు క‌నిపిస్తున్నారు. హీరో మొదలుకుని కమెడియ‌న్ వ‌ర‌కు అన్ని పాత్ర‌ల్లో తెలుగువారే ఉన్నారు. కానీ సాహోలో మాత్రం తెలుగుతో పాటుగా హిందీ న‌టీ న‌టుల‌కు కూడా ఎక్కువ పాత్ర‌లు ద‌క్కాయి.

మరిన్ని వార్తలు:

వ‌ర్మ త‌రువాత రాజ‌మౌళి

పూరి కూతురు ఎంట్రీ…