పూరి కూతురు ఎంట్రీ…

puri jagannath daughter pavithra turns as producer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ కొడుకు ఆకాష్‌ పూరి హీరోగా ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో నటించాడు. త్వరలోనే పూర్తి స్థాయి హీరోగా ఆకాష్‌ పూరి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. తన దర్శకత్వంలోనే కొడుకును హీరోగా భారీ ఎత్తున పరిచయం చేయాలని పూరి ప్లాన్‌ చేస్తున్నాడు. ఆకాష్‌ హీరోగా 2020వ సంవత్సరంలో పూరి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూరి ప్రారంభించాడు. కొడుకు విషయం అలా ఉంచితే కూతురు పవిత్ర కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు వచ్చాయి. హీరోయిన్‌గా ఆమె ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని ఆమద్య సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అని స్వయంగా పవిత్ర చెప్పుకొచ్చింది.

తాజాగా మరోసారి పూరి కూతురు పవిత్ర సినీ రంగ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా పూరి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన ‘పైసా వసూల్‌’ చిత్ర నిర్మాణ వ్యవహారాల్లో పవిత్ర భాగస్వామి అయినట్లుగా తెలుస్తోంది. భవిష్యత్తులో ఆమె పూర్తి స్థాయి నిర్మాతగా మారే అవకాశాలున్నాయి. అందుకు ఆమె తండ్రి పూరి జగన్నాధ్‌ పూర్తి సహకారం ఉంటుందట. మొదట చిన్న చిత్రాలతో మొదలు పెట్టి స్టార్‌ హీరోలతో కూడా పవిత్ర సినిమాలు చేయాలని కోరుకుంటుంది. మరి ఆమె కోరిక నెరవేరుతుందా అనేది చూడాలి. పవిత్ర కూడా నిర్మాతగా పూర్తి స్థాయిలో 2020లో పరిచయం అవుతుందేమో అని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మొత్తానికి కొడుకు, కూతురు ఇద్దరిని కూడా ఇండస్ట్రీకే తీసుకు వస్తున్నాడు పూరి.

మరిన్ని వార్తలు:

బిగ్‌బాస్‌ ఇంటికి మహేష్‌.. కాని!

సన్నీలియోన్‌పై వింత ఫిర్యాదు

‘హలో’ వెనుక స్టోరీ ఇది