ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు అతి పెద్ద బ్యాడ్‌ న్యూస్‌

Sad News for Jr NTR Fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘జై లవకుశ’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇక ఆడియోను ఈనెల 3న గ్రాండ్‌గా విడుదల చేయాలని భావించారు. ఆడియో విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నదమ్ముళ్లు కలిసి చేసిన సినిమా అవ్వడంతో ఫ్యాన్స్‌కు ఆడియో వేడుక కన్నుల పండుగగా ఉంటుందని, హరికృష్ణ కూడా హాజరు అవ్వనున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని భారీ వర్షాలు మరియు వినాయక నిమజ్జనాల హడావుడి ఉన్న నేపథ్యంలో ఆడియో విడుదల వేడుకను క్యాన్సిల్‌ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

నందమూరి ఫ్యాన్స్‌ ఆడియో వేడుక కోసం ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఇలాంటి వార్త చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి రావడంతో వారు తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను దర్శకుడు బాబీ అద్బుతంగా తెరకెక్కించాడని, ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ఈ సినిమా నిలిచి పోయే సినిమా అవుతుందంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 120 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. సినిమాను 50 కోట్ల బడ్జెట్‌తో కళ్యాణ్‌ రామ్‌ నిర్మించాడు. రాశిఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్స్‌గా ఈ సినిమాలో నటించగా, తమన్నా ఐటెం సాంగ్‌ చేసింది. ఈ చిత్రం విడుదలకు వారం రోజుల ముందు ప్రీ రిలీజ్‌ వేడుక లేదా ఆడియో సక్సెస్‌ వేడుక వంటిది చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు:

సాహోలో మందిరాబేడీ

‘హలో’ వెనుక స్టోరీ ఇది