పాము చీమలు…ఏమి ప్లాన్ బాబు ?

CBN Master Plan On BJP

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ సమీకరణాల్లో చాలా ప్రీ ప్లాన్డు గా ఉంటారు. కాంగ్రెస్ పార్టీతో బంధం విషయంలోనూ ఆయన అదే పంథాలో ఉన్నారన్నదానికి స్పష్టమైన సూచనలు బయటకు వస్తున్నాయి. ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో చంద్రబాబు భేటీ తర్వాత ఏపీలో ఆ పార్టీతో పొత్తు ఖరారయిందన్నట్లుగా కొంత మంది ప్రచారం చేస్తూండటాన్ని తిప్పికొట్టాలని టీడీపీ అధినేత తన పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు చేశారట. ఏపీలో పొత్తుల ప్రస్తావన లేదని కేవలం జాతీయ స్థాయిలో కూటమి విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయబోతున్నామని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు.

tdp-and-congress

ఈ విషయంపై పార్టీ అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలకు స్పష్టమైన విధానాన్ని ప్రకటిస్తున్నారు. బీజేపీని మళ్లీ అధికారంలోకి రాకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం. దాని కోసం ప్రాంతీయ పార్టీల కూటమి పెట్టినా ప్రజల్లో విశ్వాసం కలగదని అంచనాకు వచ్చారు. ఓ వైపు బీజేపీ మరో వైపు కాంగ్రెస్‌తో కూడిన కూటమి ఉంటేనే ప్రత్యామ్నాయంగా ప్రజలు ఓ అంచనాకు వస్తారని ఎందుకంటే తెలంగాణలో.. తిరుగులేని విధంగా ఉన్న కేసీఆర్‌కు పోటీ ఇచ్చే నాయకుడు ఎవరూ లేరు. అయినా మహాకూటమిగా ఏర్పడిన తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులొచ్చాయి. అంటే ఒకరకంగా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చచ్చెను సుమతీ అనే ఈ ఫార్ములా తెలంగాలాలో వాడినట్టే ఇదే ఫార్ములాని దేశం మొత్తం అమలు చేస్తున్నారు చంద్రబాబు. ప్రధానమంత్రి అభ్యర్థి అనే మాట రాకుండా ముందుగా మోడీని ఎదుర్కోవడానికి దేశం మొత్తం ఏకం అయిందనే భావన తెప్పించడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

Modi

అయితే ఈ నేపధ్యంలో రాహుల్ ని ఒప్పించి అలా ప్రెస్ మీట్ పెట్టారో లేదో ఏపీలో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటుందనే ప్రచారాన్ని ఎగస్పార్టీ వాళ్ళు మొదలు పెట్టేశారు. అందుకే ఈ విషయంలో చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. జాతీయ స్థాయిలో బీజేపీని గద్దె దించడానికి కలసి పని చేస్తాం కానీ.. ఏపీలో పొత్తుల గురించి కానీ తెలంగాణలో సీట్ల సర్దుబాటు గురించి కానీ చర్చించలేదని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతల్లో క్లారిటీ వచ్చింది. దీంతో ఒకరకంగా బాబు తన ప్లాన్ లో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.