హెలికాప్టర్ లో అమరావతి నుంచి బయలుదేరిన చంద్రబాబు, లోకేశ్…!

Chandrababu Lokesh Departed From Amravati In Helicopter

నందమూరి హరికృష్ణకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో ఈరోజు నిర్దేశించుకున్న అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్న వారు ఇరువురూ ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ కు బయలుదేరారు. మరికాసేపట్లో వారు నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి నేరుగా చేరుకుని హరికృష్ణను పరామర్శించనున్నారు.

nandhamuri-cm

ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఆయనకు జరుగుతున్న చికిత్స, గాయాల తీవ్రతపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నారా భువనేశ్వరి, బ్రామ్మిని నందమూరి హరికృష్ణ గారి నివాసంలో లక్ష్మీ గారికి హరి అన్న మృతి చెందిన విషయం చెప్పారు..దీంతో ఆయన సతీమణి ఒక్కసారిగా కింద పది స్పృహ కోల్పోయింది.

cm-and-nandhamuri