టీడీపీ కొత్త అస్త్రం మీద వర్మ కౌంటర్ ఏంటో.

Chandrababu Ordered TDP leaders To Follow Silence Strategy Against RGV Laxmi's Ntr Movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

“లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విసిరిన పబ్లిసిటీ వలలో పడి కొట్టుకుంటున్న టీడీపీ నేతలకు కొత్త అస్త్రం దొరికింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు స్వయంగా దీని మీద దృష్టి పెట్టి ఈ అస్త్రాన్ని రూపొందించారు. ఆ అస్త్రమే మౌనం. వర్మ ఎంత రెచ్చగొట్టినా పట్టించుకోకుండా ఉంటే అదే సరిపోతుందని టీడీపీ శ్రేణులకు బాబు దిశానిర్దేశం చేశారు. అయితే వివాదాలు రెచ్చగొట్టడంలో ఆరితేరిన వర్మ ఈ అస్త్రానికి పడిపోతాడా అంటే అనుమానమే. ఎప్పుడైనా మనుషుల మానసిక స్థితిని బట్టి ఆటలాడుకునే వర్మ కి ఓ పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం అంత కష్టమా ?. పైగా “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” కి ఓ క్రేజ్, కాసిని డబ్బులు తేవడానికి ఇది తిరుగులేని, పైసా ఖర్చు లేని పని.

ఎదుటి వాళ్ళు ఎంత సంయమనం పాటించినా రెచ్చగొట్టడానికి ఏ పద్ధతులు పాటించాలి అన్నదానిపై ఆల్రెడీ వర్మ వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇద్దరు కొట్టుకోడానికి సిద్ధంగా ఉంటే తేలిగ్గా గొడవ వస్తుంది కానీ ఒకరు తప్పుకుపోవాలని అనుకుంటే తగాదా పడడం కూడా కష్టమే. ఈ క్రమంలో ఒకవేళ పరిధికి మించి వ్యవహరిస్తే జనం దృష్టిలో మరీ చెడ్డ పేరు వస్తుంది. కానీ వర్మకి ఆల్రెడీ అది కావాల్సినంత వుంది. ఆయన దృష్టి అంతా ఇప్పుడు “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” ని అడ్డుకోడానికి టీడీపీ, చంద్రబాబు,బాలయ్య గట్టి ప్రయత్నం చేస్తున్నారని జనం అనుకునేలా చేయడం. తద్వారా లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద ఆసక్తి కలిగించడం.ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో, టీడీపీ ప్రయోగిస్తున్న మౌన అస్త్రంతో వర్మకి ఇది పెద్ద సవాల్.