చంద్రయాన్ 3 సక్సెస్..ఇస్రో టీమ్​పై ప్రపంచం ప్రశంసల వర్షం.!

Chandrayaan 3
Chandrayaan 3

ఒకప్పుడు చందమామ రావే.. జాబిల్లి రావే అని పాట పాడుకునే వాళ్లం. కానీ ఇప్పుడు.. మామా బ్రో మేమే వచ్చేస్తున్నాం అంటూ చందమామపైకి వెళ్లిపోయాం. ప్రపంచంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమెదటి దేశంగా భారత్​ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జాబిల్లిపై విక్రమ్ ల్యాంజర్​ను విజయవంతంగా దింపిన ఇస్రో టీమ్​పై ప్రపంచం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో జొహెన్నెస్​బర్గ్ నుంచి స్వయంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్​కు ఫోన్ చేసి అభినందించారు. త్వరలోనే చంద్రయాన్‌-3 మిషన్‌ బృందాన్ని అభినందించేందుకు మోదీ బెంగళూరు పర్యటించనున్నారు. ఈ క్షణంతో తన జీవితం ధన్యమైందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశంగా భారత్​ అవతరించాలనే సంకల్పానికి నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్‌ సమావేశాల్లో ఉన్నా తన మనసంతా చంద్రయాన్‌పైనే ఉందని చెప్పుకొచ్చారు.