ఛార్మికి 4 కోట్లు ఏంటి బాసూ!

Charmme Gets Rs 4 Crore For Paisa Vasool Movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Charmme Gets Rs 4 Crore For Paisa Vasool Movie

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక హీరోయిన్‌కు కోటి రూపాయల పారితోషికం అంటే ఆహా ఓహో అంటున్నారు. స్టార్‌ హీరోయిన్స్‌ సమంత, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, అనుష్క, నయన్‌ తాజాగా పూజా హెగ్డే వంటి వారు మాత్రమే కోటి ఆపై అందుకుంటున్నారు. అయితే ఛార్మి ఏకంగా 4 కోట్లు పారితోషికం అందుకోవడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా. నిజంగానే ఛార్మి ఏకంగా నాలుగు కోట్ల పారితోషికం అది కూడా బాలయ్య బాబు ‘పైసా వసూల్‌’ చిత్రానికి అందుకున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది.

దర్శకుడు పూరికి ఛార్మికి చాలా కాలంగా అన్యోన్య సంబంధం కొనసాగుతుంది. ఆ సంబంధం కారణంగానే ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ఛార్మిని నిర్మాతగా పూరి చేశాడు. ఆ తర్వాత పూరి చేస్తున్న ప్రతి సినిమాలో కూడా ఛార్మిని భాగస్వామి చేస్తున్నాడు. తాజాగా బాలయ్య హీరోగా చేస్తున్న ‘పైసా వసూల్‌’ చిత్రానికి గాను ఛార్మిని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా నియమించడం జరిగింది. భవ్య క్రియేషన్స్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఛార్మి దగ్గరుండి చూసుకుంటుంది. దర్శకుడి తర్వాత నిర్మాత కంటే ఎక్కువ బాధ్యతలను ఛార్మి చూసుకుంటుందట. అందుకే ఆమెకు ఏకంగా నాలుగు కోట్ల పారితోషికంను ఇవ్వాలని పూరి చెప్పడం, అందుకు నిర్మాత కూడా ఓకే చెప్పడం జరిగిపోయిందట. అదే సినిమాలో నటిస్తున్న హీరోయిన్‌ శ్రేయకు కేవలం 40 లక్షల పారితోషికం మాత్రమే ఇచ్చారు. దర్శకుడితో సన్నిహితంగా ఉంటే మరీ ఇంత లాభమా అని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.

మరిన్ని వార్తలు:

కృష్ణవంశీని బూతులు తిట్టిన డాన్స్ మాస్టర్.

జైలవకుశ లీక్… ఎన్టీఆర్ ఫాన్స్ కి విన్నపం.