బాహుబలికి మోక్షజ్ఞకు సంబంధం ఏంటి?

how Nandamuri Mokshagnya related to BaahuBali

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

How  Nandamuri Mokshagnya Related To BaahuBali

‘బాహుబలి’ చిత్రంతో ఏకంగా రెండు వేల కోట్ల లాభాలను దక్కించుకున్న ఆర్కా మీడియా నిర్మాతలు శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్‌ దేవినేనిలు త్వరలోనే శర్వానంద్‌ హీరోగా ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా సంగతి అలా ఉంటే టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం చర్చ జరుగుతుంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను ఆర్కా మీడియా బ్యానర్‌లో పరిచయం చేయాలని భావిస్తున్నారు. బాలకృష్ణకు చాలా రోజుల క్రితమే సాయి కొర్రపాటికి హామీ ఇచ్చాడు. మోక్షజ్ఞ బాధ్యతను సాయి కొర్రపాటికి అప్పగించడం ఖాయం అని అంతా భావిస్తున్న సమయంలో ఆర్కా మీడియా వారు  ఈ ప్రాజెక్ట్‌కు రావడం చర్చనీయాంశం అవుతుంది. 

ఆర్కా మీడియా నిర్మాతలు అయిన శోభు యార్లగడ్డ మరియు ప్రసాద్‌ దేవినేనిలతో వారాహి చలన చిత్ర నిర్మాత సాయి కొర్రపాటికి సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో బాహుబలి వంటి బ్లాక్‌ బస్టర్‌ను నిర్మించిన నిర్మాణ సంస్థతో మోక్షజ్ఞ పరిచయం అయితే మంచి మైలేజ్‌ రావచ్చు. అందుకే సాయి కొర్రపాటి స్వయంగా ఆర్కా మీడియా నిర్మాతలతో చర్చించి వారిని కూడా మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని భావించాడు. అందుకు వారు కూడా ఓకే చెప్పారు. ఈ విషయం బాలయ్యకు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే సంవత్సరం మోక్షజ్ఞ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. బాహుబలి ప్రొడక్షన్‌లో మోక్షజ్ఞ ఎంట్రీ ఖచ్చితంగా అంచనాు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. నందమూరి ఫ్యాన్స్‌ మోక్షజ్ఞ కోసం కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు