అల్లుళ్ల మద్య రాజీ కుదిర్చిన చిరు

Chiranjeevi announces another release date on vijetha movie

మెగా ఫ్యామిలీ నుండి సంవత్సరంకు ఒక్కరు, ఇద్దరు హీరోలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు. కొత్త వారు ఎక్కువ అవుతున్న సమయంలో మెగా ఫ్యామిలీ హీరోల మద్య పోటీ కూడా పెరుగుతుంది. గతంలో మెగా హీరోల సినిమాలకు కనీసం రెండు మూడు నెలల గ్యాప్‌ ఉండేది. కాని ప్రస్తుతం అది వారం రెండు వారాలకు పడిపోయింది. తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం మరియు చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌ నటించిన ‘విజేత’ చిత్రాలు ఒకేసమయంలో విడుదలకు సిద్దం అయ్యాయి. రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు ఒకే సమయంలో విడుదల కాబోతున్నాయనే చర్చ జరిగింది. జులై 6న రెండు చిత్రాలు విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

రెండు మెగా చిత్రాలు ఒకే రోజును విడుదల కావడం ఎంత మాత్రం మంచిది కాదని, కనీసం వారం లేదా రెండు వారాలు అయినా గ్యాప్‌ ఉంటేనే బాగుంటుందని చిరంజీవి భావించాడు. ఇద్దరు నిర్మాతలతో చర్చలు జరిపి ‘విజేత’ చిత్రాన్ని వారం రోజులు ఆలస్యంగా విడుదల చేసేందుకు చిరంజీవి నిర్మాతను ఒప్పించాడు. ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం విడుదలైన తర్వాత వారం రోజులకు విజేత గా కళ్యాణ్‌ దేవ్‌ రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలకు కేవలం వారం గ్యాప్‌ మాత్రమే ఉండటంతో కలెక్షన్స్‌ పరంగా ఖచ్చితంగా ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముందు ముందు మెగా హీరోల మద్య మరీ ఎక్కువగా పోటీ వాతావరణం నెలకొంటుందని, ఇలా అయితే కష్టమే అంటూ మెగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి సలహాతో మెగా అల్లుళ్లు కూల్‌ అయ్యి, రాజీకి రావడంతో పరిస్థితి కాస్త సర్దుమనిగినట్లయ్యింది.

అల్లుళ్ల మద్య రాజీ కుదిర్చిన చిరు - Telugu Bullet