చిరంజీవిని నిరుత్సాహ పర్చింది ఎన్టీఆర్‌ లేదా ఏయన్నార్‌! 

chiranjeevi speech at chalo movie pre release function

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ మూవీ ప్రిరిలీజ్‌ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఆ వేడుకలో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ‘ఛలో’ వేడుకకు రావాల్సిందిగా నాగశౌర్య మరియు ఆయన తల్లి తన వద్దకు వచ్చినప్పుడు బిజీగా ఉన్న కారణంగా రాలేను అని చెప్పానుకున్నాను. కాని కెరీర్‌ ఆరంభంలో తాను పడ్డ నిరాశను నాగశౌర్య పడవద్దనే ఉద్దేశ్యంతో తాను ఈ వేడుకకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. చాలా సంవత్సరాల క్రితం తాను ఒక సినిమా 100 రోజుల వేడుకకు అప్పట్లో ఒక స్టార్‌ను ఆహ్వానించడం జరిగింది. ఆయన ముందుగా వస్తాను అని హామీ ఇచ్చి, ఆ తర్వాత రాలేను అంటూ చెప్పాడు. దాంతో ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఆ 100 రోజుల పండుగ జరిగింది అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. అప్పుడు నేను పడ్డ నిరుత్సాహం నాగశౌర్య అనుభవించవద్దనే ఇప్పుడు వచ్చాను అంటూ చిరంజీవి పేర్కొన్నాడు.

చిరంజీవిని నిరాశ పర్చిన ఆ స్టార్‌ హీరో ఎవరై ఉంటారు అంటూ ప్రస్తుతం చర్చ జరుగుతుంది. చిరంజీవి కెరీర్‌ ఆరంభంలో టాలీవుడ్‌ను ఏలేస్తున్న హీరోలు కొందరు ఉన్నారు. వారిలో ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ ముఖ్యులు. అప్పటి చిన్న స్టార్‌ హీరోల సినిమాలకు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లు ముఖ్య అతిథులుగా వెళ్లేవారు. అయితే చిరంజీవి 100 రోజుల వేడుకకు కూడా ఎన్టీఆర్‌ లేదా ఏయన్నార్‌ను ఆహ్వానించి ఉంటాడు, వారు బిజీగా ఉండటం లేదా ఇతరత్ర కారణాల వల్ల రాలేక పోయి ఉంటారు అనేది కొందరి వాదన. ఎన్టీఆర్‌ మరియు ఏయన్నార్‌లు మాత్రమే కాకుండా కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణం రాజులు కూడా అప్పుడు ఫాంలో ఉన్నారు. ఈ ముగ్గురిలో కూడా చిరంజీవిని నిరాశ పర్చిన హీరో ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం ఎన్టీఆర్‌ లేదా ఏయన్నార్‌ పేరును చెబుతున్నారు. అసలు విషయం చిరంజీవి గారికే తెలియాలి