‘రంగస్థలం’ సీక్వెల్‌ లేదు, కాని!!

clarityn about Rangasthalam movie sequel

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘రంగస్థలం’ చిత్రంకు సుకుమార్‌ ఆ మద్య సీక్వెల్‌ చేస్తాను అంటూ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇంత మంచి పేరు వచ్చిన రంగస్థలంను అంత సులబంగా వదిలేయాలనిపించడం లేదని, చిట్టిబాబు పాత్రను మరింతగా విస్తరించి ఒక కథ రాసి సీక్వెల్‌ చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన సుకుమార్‌ తాజాగా మాట మార్చాడు. ‘రంగస్థలం’ చిత్రాన్ని సీక్వెల్‌ చేసే ఉద్దేశ్యం అయితే లేదు. కాని పల్లెటూరు నేపథ్యంలో మళ్లీ సినిమా చేయాలని కోరిక ఉందని, అందుకోసం మళ్లీ రంగస్థలంలోని పాత్రలను వాడుకోవాలని తనకు లేదంటూ చెప్పుకొచ్చాడు.

‘రంగస్థలం’ చిత్రం సీక్వెల్‌ చేయాలని సుకుమార్‌ భావించినప్పటికి రామ్‌ చరణ్‌, సుకుమార్‌లు నిర్మొహమాటంగా అలాంటి సినిమాను మళ్లీ చేయాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అందుకే ఆ చిత్రాన్నికి సీక్వెల్‌ చేస్తే నటించే యోచన లేదు అంటూ చెప్పుకొచ్చారు. దాంతో ఇద్దరికి ఇష్టం లేని సీక్వెల్‌ తనకు కూడా వద్దని దర్శకుడు సుకుమార్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రంగస్థలం చిత్రంలోని ప్రతి పాత్ర కూడా అందరిని ఆకట్టుకుంది. అందుకే ఆ పాత్రల కొనసాగింపును ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కాని ప్రేక్షకుల కోరిక మేరకు కాకుండా రంగస్థలం ఫ్లేవర్‌తోనే ఒక పల్లెటూరు నేపథ్యంలో సినిమా చేసేందుకు స్క్రిప్ట్‌ రెడీ చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సినిమాకు రంగస్థలం 2 అని టైటిల్‌గా పెడతానేమో అంటూ సుకుమార్‌ చెప్పుకొచ్చాడు.