దిల్‌రాజుతో సాయి పల్లవి విభేదాలు.. ఇదే సాక్ష్యం

Cold war between sai Pallavi and Dil Raju

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలుగులో టాప్‌ నిర్మాత అంటే ఠక్కున వినిపించే పేర్లలో దిల్‌రాజు పేరు తప్పకుండా ఉంటుంది. దిల్‌రాజు ఈ సంవత్సరం ఏకంగా ఆరు సక్సెస్‌లను దక్కించుకున్నాడు. అందులో కొన్ని సూపర్‌ హిట్‌లు కూడా ఉండటం గుర్తించాల్సిన విషయం. అంతటి భారీ విజయాల ట్రాక్‌ రికార్డు ఉంది కనుకే ఎక్కువ శాతం స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్‌ కూడా ఆయన బ్యానర్‌లో నటించాలని కోరుకుంటారు. కాని సాయి పల్లవి మాత్రం నిర్మాత దిల్‌రాజుతో విభేదాలు పెట్టుకుంది. ఈ వార్తలు ‘ఎంసీఏ’ చిత్రీకరణ సమయంలో వచ్చాయి. అయితే అప్పుడు ఆ వార్తలను చిత్ర యూనిట్‌ సభ్యులు కొట్టి పారేశారు. సాయి పల్లవి, దిల్‌రాజుల మద్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.

‘ఎంసీఏ’ విడుదల సమయంలో కూడా సాయి పల్లవి ఎక్కువ ప్రమోషన్‌లో పాల్గొనలేదు. ఆ సమయంలో ఆమెకు తమిళంలో మంచి అవకాశం రావడంతో ప్రమోషన్స్‌లో ఎక్కువ పాల్గొనడం లేదని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా దిల్‌రాజు బ్యానర్‌లో ఈ సంవత్సరం వచ్చి సూపర్‌ హిట్‌ అయిన చిత్రాల వేడుకలు చేశారు. దిల్‌రాజు డబుల్‌ హ్యాట్రిక్‌ వేడుకలో ఆరు చిత్రాలకు సంబంధించిన యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. కాని సాయి పల్లవి మాత్రం మిస్‌ అయ్యింది. దిల్‌రాజుపై కోపంతోనే సాయి పల్లవి హాజరు కాలేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వయంగా దిల్‌రాజు ఫోన్‌ చేసి మరీ సాయి పల్లవిని ఆహ్వానించాడట. కాని ఆమె మాత్రం ఏమాత్రం ఆహ్వానంను పట్టించుకోలేదు అంటూ సమాచారం అందుతుంది. దిల్‌రాజు, సాయి పల్లవిల మద్య విభేదం ఏంటీ అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.