Crime: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కన్న కొడుకునే కడతేర్చిన తల్లి

Crime: A mother married off her younger son because he was preventing her from having an extra-marital affair
Crime: A mother married off her younger son because he was preventing her from having an extra-marital affair

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కన్న తల్లే కుమారుడిని కడతేర్చిన దారుణ ఘటన బుధవారం అర్ధరాత్రి నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై నాగశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి , రవీందర్ దంపతులకు ముగ్గురు సం తానం . ఇద్దరు కుమారులు వేర్వేరు ఊర్లలోని హాస్టళ్లలో ఉంటూ.. 9, 7 తరగతులు చదువుతున్నారు. చిన్న కుమారుడు హరికృష్ణ ఇంట్లోనే ఉంటూ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు.

లక్ష్మికి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి హరికృష్ణ అడ్డుగా ఉన్నాడని ఆమె భావించింది. బుధవారం అర్ధరాత్రి భర్త రవీందర్ పొలం వద్దకు వెళ్లగా హరికృష్ణ తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టిలో వేసింది. నీట మునిగి చనిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించేందుకు యత్నించింది. తలపై రక్త గాయాలు ఉండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. లక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారింగా.. నేరాన్ని అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు. రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.