Election Updates: వైసీపీ నేతలను ఉద్దేశించి నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు

Election Updates: Nagababu severely criticizes YCP leaders
Election Updates: Nagababu severely criticizes YCP leaders

వైసిపి పార్టీపై కొనిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అనే కోటకి మకుటం లేని మహారాజు మీ నాయకుడు అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘అవినీతి కిరీటాన్ని మాక్కావాలి అంటూ పోటీ పడుతున్న మీరు మా సభలని విమర్శిస్తున్నారని ఎద్దేవ చేశారు. ఎలా నవ్వాలో తెలియట్లేదు. ప్రజాగళం సభలో మీటింగు ఫెయిల్, మైకు ఫెయిల్ అని మొరిగే మూర్ఖులంతా విన్నారా, ప్రధాని మోదీ నిన్న మీకు ‘భ్రష్టాచార్’ అనే బిరుదు నిచ్చారు’ అని ఆయన ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.

కాగా, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖాయమయ్యాక …..చిలకలూరిపేటలోని బొప్పూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రజాగళం సభ లో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావిస్తున్నా ఆయన పేర్కొన్నారు. ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు..ఎన్డీఏకి 400 సీట్లు దాటాలి. ఇందుకోసం మీరంతా ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.