Election updates: వైకాపా నేతలపై నరసరావుపేట ఎంపీ ఫిర్యాదు

Election updates: Narasa Raopet MP's complaint against Vaikapa leaders
Election updates: Narasa Raopet MP's complaint against Vaikapa leaders

విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తన పేరుపై ట్వీట్ చేయడాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృ ష్ణదేవరాయలు తప్పుబట్టారు. శనివారం సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైకాపా నేతలపై ఫిర్యాదు చేశారు.

విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో ఎలాంటి ఆధారాల్లేకుండా వైకాపా ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించారు. ఈ కేసులో సీబీఐ విచారణకొనసాగుతోందని, నిజనిర్ధరణ కాకుండానే తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి సంబంధం లేకపోయినా ఆరోపణలు చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.