పాత మొగుడు కొట్టి మరీ కొత్త పెళ్లి చేశాడా?

ex husband married to ex wife in Chinthamani karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటకలో తనతో విడాకులు తీసుకున్న మాజీ భార్య పెళ్ళికి హాజరైన భర్త అంటూ మీడియా ఉదరగొట్టేసిన ఓ పెళ్లి కథ అనూహ్య మలుపు తీసుకుంది. మాజీ భార్య రచన పెళ్ళికి ఆమె మాజీ భర్త రావడం, ఆశీర్వదించడం గురించి అంతా గొప్పగా చెప్పుకున్నారు. అయితే అందులో కొత్తకోణం ఇప్పుడు వెలుగు జూసింది. మ్యాటర్ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది.

కర్ణాటకలో చిక్క బళ్లాపుర జిల్లా చింతామణికి చెందిన రచనకి 15 ఏళ్ల కిందట ఈశ్వర గౌడ తో వివాహం అయ్యింది. వీరికి ఒక బాబు , ఒక పాప పుట్టారు. వారికి విభేదాలు వచ్చి కిందటి ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్నారు. రచన రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షురాలు. ఈమె స్వయంగా ఓ పాఠశాల కూడా నిర్వహిస్తున్నారు. అదే పాఠశాలలో డ్రైవర్ గా పనిచేస్తున్న మంజునాధ్ ని ఆమె ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళికి ఈశ్వర గౌడ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా మంజునాధ్, రచనల ప్రేమ విషయం తెలిసి ఆయనే దగ్గరుండి ఈ పెళ్లి చేశారని మీడియా కోడై కూసింది.

అయితే జరిగింది ప్రేమ పెళ్లి కాదని బలవంతపు పెళ్లి అని మంజునాధ్, ఆయన తల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. పెళ్ళికి ముందే డ్రైవర్ గా పని చేస్తున్న తన కొడుకుని వాడుకున్న రచన, ఆ తర్వాత మాజీ భర్త, ఆయన సన్నిహితులతో మంజునాధ్ ని బెదిరించి,కొట్టి ఇష్టం లేని పెళ్లి జరిపించారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు సాక్ష్యంగా మంజునాధ్ వీపు మీద తేలిన వాతల్ని చూపింది. దీంతో ఇప్పుడు పోలీసులకి ఈ చిత్రమైన కేసు పెద్ద పరీక్షగా మారింది.

 మరిన్ని వార్తలు 

ఆ ముసలమ్మ మాట వింటే స్వచ్ పాలిటిక్స్ మీద ఆశ… వైరల్ వీడియో

నీళ్లు ఇలా తాగితే మీకు డాక్టర్ అవసరమే రాదు.

హెరిటేజ్ కి రూట్ క్లియర్… మంత్రికి వార్నింగ్.