ఏపీ ప్రజలకు శుభవార్త… సంక్రాంతికి మరో 5 లక్షల ఇళ్లు

Good news for AP people… 5 lakh more houses for Sankranti
Good news for AP people… 5 lakh more houses for Sankranti

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే సంక్రాంతి నాటికి మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. తాజాగా విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పై మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి పక్కా గూడు కల్పించాలని దూడ సంకల్పంతో ఈ పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద ఐదు లక్షలకు పైగా నిర్మించినట్లు జోగి రమేష్ తెలిపారు. మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఇల నిర్మాణాలతో పాటు జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులను కూడా వేగవంతం చేయాలని మంత్రి జోగి రమేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు.