ఇంకా కొన్ని రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతున్న టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఏపీ, తెలంగాణ మార్కెట్లకు సంబంధించి కీలక అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
ఇప్పటికే ఏపీలో టికెట్ ధరల హైక్స్, షో టైమింగ్స్పై స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నైజాం మార్కెట్కు సంబంధించిన లేటెస్ట్ బజ్ ఆసక్తికరంగా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం నైజాంలో ‘పెద్ది’ అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయట. అంతేకాదు, అక్కడ కూడా టికెట్ రేట్లలో హైక్స్ ఉండే అవకాశముందని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ఇక ఈ చిత్రంలో జగపతి బాబు, బొమన్ ఇరానీ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, సంగీతానికి ఏఆర్ రెహమాన్ ప్రాణం పోస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
