గుంటూరు కారం: రివ్యూస్‌లకు అతీతం – నిర్మాత నాగవంశీ

గుంటూరు కారం: రివ్యూస్‌లకు అతీతం – నిర్మాత నాగవంశీ
Cinema News

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. ఈ సినిమా పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు నెలకొన్నాయి . మహేష్ బాబు మంచి మాస్ పాత్ర చేస్తున్న ఈ సినిమా కి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రఘుబాబు, సునీల్, జగపతి బాబు, మహేష్ ఆచంట, ఆలీ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకోగా సెకండ్ సాంగ్ కూడా త్వరలో నే విడుదల చేయనున్నారు. విషయం ఏమిటంటే, ఈ సినిమా గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి రిలీజ్ కి రెడీ అయిన ఆదికేశవ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో భాగంగా సినిమా రివ్యూస్ గురించి పలువురు విలేఖర్లతో మాట్లాడిన నిర్మాత నాగవంశీ, సినిమాలు రిలీజ్ కి ముందు కంటే రిలీజ్ అయిన ఒక రోజు అనంతరం రివ్యూస్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం తెలిపారు.

గుంటూరు కారం: రివ్యూస్‌లకు అతీతం – నిర్మాత నాగవంశీ
Guntur Karam

ఆ సందర్భంలో మీ గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతికి ఉంది కదా దాని గురించి చెప్పండి అని అంటూ ఒక విలేఖరి అనడంతో, అసలు ఆ సినిమా కి రివ్యూస్ తో అవసరం లేదని, అది పక్కా బ్లాక్ బస్టర్ కంటెంట్ తో వస్తున్న సినిమా అని తెలియచేసారు. మొత్తంగా ఈ విధంగా నిర్మాత నాగవంశీ సహా టీమ్ మొత్తం కూడా మొదటి నుండి గుంటూరు కారం సినిమా కంటెంట్ పై ఎంతో నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు . మరి హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ఈ సినిమా జనవరి 12న రిలీజ్ తరువాత ఏ స్థాయి సక్సెస్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.