ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !

ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !
Cinema News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుందా అని అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. గుంటూరు కారం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ్టి నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ ‘గుంటూరు కారం’ అందుబాటులోకి వచ్చింది.

ఓటీటీలోకి వచ్చేసిన గుంటూరు కారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే !
Cinema News

ఇదీ స్టోరీ : వైరా వ‌సుంధ‌ర (ర‌మ్య‌కృష్ణ‌), రాయ‌ల్ స‌త్యం (జ‌య‌రామ్‌) కొడుకు వీర వెంక‌ట ర‌మ‌ణ అలియాస్ ర‌మ‌ణ (మ‌హేశ్‌బాబు). చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులిద్ద‌రూ విడిపోవ‌డంతో అతడు గుంటూరులో తన మేన‌త్త బుజ్జి (ఈశ్వ‌రిరావు) ద‌గ్గ‌ర పెరుగుతాడు. వ‌సుంధ‌ర మ‌రో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంక‌టస్వామి (ప్ర‌కాశ్‌రాజ్‌) అన్నీ తానై రాజ‌కీయ చ‌క్రం తిప్పుతుంటాడు. వ‌సుంధ‌ర రాజ‌కీయ జీవితానికి ఆమె మొద‌టి పెళ్లి, మొద‌టి కొడుకు అడ్డంకిగా మార‌కూడ‌ద‌ని భావించిన వెంక‌ట‌స్వామి… ర‌మ‌ణ‌తో ఓ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టడమే గాక.. వ‌సుంధ‌ర‌కి పుట్టిన రెండో కొడుకుని ఆమె వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నంలో ఉంటాడు. త‌ల్లిని ఎంతో ప్రేమించే ర‌మ‌ణ… ఆ అగ్రిమెంట్‌పై సంత‌కం పెట్టాడా?ఇంత‌కీ అందులో ఏముంది?త‌న త‌ల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? క‌న్న కొడుకుని వ‌సుంధ‌ర ఎందుకు వ‌దిలిపెట్టింది? అన్నది ఈ సినిమా స్టోరీ.