బియ్యం ఎగుమతుల నిషేధం విషయంలో మోడీ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?

Prime Minister Narendra Modi
Prime Minister Narendra Modi

ఆమధ్య బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. బియ్యం నిషేధంపై మీడియా సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ సర్కులేట్ అయ్యాయి. ఇదే సమయంలో మోడీపై విమర్శలు కూడా మొదలయ్యాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా ఉన్న దేశం కాబట్టి ఆహార సంక్షోభం ఏర్పడితే.. దానిని మరొక దేశం భర్త చేసే అవకాశం లేదు. అంతిమంగా ఇది ప్రభుత్వాన్ని ఇబ్బందికి గురిచేస్తోంది. ఈక్రమంలోనే భారత్ బియ్యం పై నిషేధం విధించింది. అదే సమయంలో బియ్యం, గోధుమలపై కిలో ధర రెండు రూపాయలు తగ్గించింది. టోకు వ్యాపారులకు 50 లక్షల టన్నుల బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓఎంఎస్ఎస్ కింద కిలో బియ్యం రిజర్వు ధర 29 రూపాయలుగా నిర్ణయించింది.

దీనివల్ల వ్యాపారులు ధరలను తగ్గించేందుకు అనివార్య పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో ప్రస్తుతం రెండు రూపాయల వరకు ధర తగ్గింది.ఇప్పటికే గోధుమల,బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం.. ఈ జాబితాలోకి చక్కెరను కూడా చేర్చినట్టు తెలుస్తోంది.