టీడీపీ ఎమ్మెల్యే కంపెనీల్లో ఐటీ సోదాలు

Beeda Masthan Rao

ఏపీలో ఐటీశాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గురువారం నుంచి మొదలైన దాడులు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలతో పాటూ బంధువులు, సన్నిహితుల కంపెనీలలోనూ తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, జరుగుమల్లి మండలం కె. బిట్రగుంటలో ఉన్న సదరన్ ఇన్ ఫ్రా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్‌లో సోదాలు జరిగాయి.

IT raids on firms of Beeda Mastan Rao

ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెం వద్ద ఉన్న రాక్ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్‌లో కూడా దాడులు చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ టార్గెట్‌గా సోదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్న సమయంలోనే.. ఇలా ఐటీ అధికారులు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై చంద్రబాబు కూడా పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.