ఆ విషయంలో జగన్ పంతం నెగ్గింది !

YS Jagan Public Meeting In Tirupathi

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యి ఆ తర్వాత బయటకు వచ్చి ఏపీ ప్రయోజనాల కోసమే భేటీ అయ్యానని చెప్పుకొచ్చారు. మోడీకి ఇచ్చిన విజ్ఞాపన పత్రం అంటూ.. ఓ లేఖను మీడియాకు ఇచ్చారు. కానీ తర్వాత ఓ దినపత్రిక అసలు మోడీకి ఇచ్చిన లేఖంటూ ఓ పత్రాన్ని బయటపెట్టింది. అదేంటంటే హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. వాళ్లు చంద్రబాబు ఏజెంట్లు. వారిపై చర్యలు తీసుకోండని ఉంది. దానికి కారణం ఏంటంటే అక్రమాస్తుల కేసులో వైఎస్ భారతిని ఇంక్లూడ్ చేస్తూ కోర్టులో ఈడీ అదనపు చార్జిషీట్ దాఖలు చేసిది. ఆ వివరాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఈ సారి జగన్ ఒక బహిరంగలేఖ రాశారు. అందులోనూ.. ఆయన ప్రధానంగా ” ఉమాశంకర్ గౌడ్, గాంధీ అనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. వాళ్లు చంద్రబాబు ఏజెంట్లని చెప్పుకొచ్చారు.

ఆ విషయంలో జగన్ పంతం నెగ్గింది ! - Telugu Bulletనిజానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు విచారణ అధికారులను బెదిరించేలా వారి పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం అప్పట్లోనే కలకలం రేపింది. ఆయన బీజేపీ పాలన వచ్చాక దర్యాప్తు సంస్థల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు కనీ ఒకపుడు వాటి మీద నమ్మకమే లేదని అనేవారు. బీజేపీతో ఇప్పుడు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈడీ, సీబీఐ, ఐటీ వంటి వాటిపై జగన్ వైపు నుంచి పెద్దగా ఫిర్యాదులు రావడం లేదు. అయితే ప్రస్తుతం జగన్ చెబుతున్న ఆ ఉమా శంకర్ గౌడ్, గాంధీలను కేంద్రం బదిలీ చేసింది. ఉమాశంకర్ గౌడ్‌ని కేరళకు బదిలీ చేశారు. కొత్తగా ఈడీకి కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారిని నియమించారు. గాంధీని తన మాతృశాఖకు పంపించారు. గాంధీ డిప్యూటేషన్ మీద చాలా కాలంగా ఈడీలో పని చేస్తున్నారని జగన్ తన లేఖల్లో ప్రస్తావించారు. ఇప్పుడు అదే కారణంతో ఆయనను కేంద్రం మాతృశాఖకు పంపించేసింది. మొత్తానికి ఈడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని నెగ్గిచుకున్నారు. ఎన్నికలకు ముందు సుదీర్ఘ కాలంగా పోరాడిన ఓ అంశంలో విజయం సాధించారు.