జగిత్యాల సూసైడ్…ఆ విద్యార్థులు ప్రేమించింది అక్కాచెల్లెళ్లను…!

Jagtial Boys Suicide Mistary

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన‌ జగిత్యాల టెన్త్ క్లాస్ విద్యార్థుల ఆత్మహత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందరూ భావించినట్లుగా రవితేజ, మహేందర్‌లు ఒకే అమ్మాయిని ప్రేమించి, ఆమె కోసం గొడవపడి, ఆత్మహత్యకు పాల్పడలేదని పోలీసులు ప్రకటించారు. ఘటనా స్థలిలో స్వాధీనం చేసుకున్న మహేందర్, రవితేజల మొబైల్స్ కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులు వారు వేర్వేరు బాలికలతో మహేందర్‌, రవితేజ రోజూ చాటింగ్‌ చేస్తుండేవారని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ సోమవారం తెలియజేశారు.

suside
అయితే, ఆ అమ్మాయిలిద్దరూ అక్కా చెల్లెళ్లనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసి అమ్మాయిల తల్లిదండ్రులు మందలించారని, దీంతో వారు మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.ఆ అక్కా చెల్లెళ్లతో వీరు రోజూ ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేసినట్టు గుర్తించారు. తమ కుమార్తెలకు ఫోన్ చేస్తున్న విషయం అమ్మాయిల తండ్రికి తెలియడంతో వారిని పిలిచి, పలుమార్లు హెచ్చరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. మద్యానికి బానిసలైన ఈ విద్యార్థులు, వారం రోజుల కిందట ఆ అక్కాచెల్లెళ్ల ఇంటి పరిసరాల్లో కనిపించడంతో వారి తండ్రి మరోసారి హెచ్చరించాడు.
దీంతో తమ ప్రేమ విఫలమవుతుందని మనస్తాపం చెందిన మహేందర్, రవితేజ ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవించి, ఆ మత్తులో పెట్రోలు పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారని డీఎస్పీ వెంకటరమణ వివరించారు. ఓ బంకులో ఇద్దరూ పెట్రోలు కొనుగోలుచేసి తీసుకు వెళ్తున్న సీసీ కెమెరా ఫుటేజ్‌లను సేకరించామని, ఆపై మిషన్ కాంపౌండ్‌కు వెళ్లి మందు కొట్టారని ఆయన తెలిపారు. తమ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయిందని కూడా బాధపడ్డారని అందుకే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు ప్రకటించారు.

friends-suside
ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశంలో వారిద్దరు మాత్రమే ఉన్నారని, మూడో వ్యక్తి ప్రమేయం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే మరొకరు కాపాడే ప్రయత్నం చేసి మరణించారనే వార్తల్లోనూ నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. ఆత్మహత్య చేసుకోవాలని వారు ముందే నిర్ణయించుకున్నారని, ఇద్దరూ కలిసి పెట్రోలు బంకుకు వెళ్లి వేర్వేరు బాటిళ్లతో పెట్రోల్ కొని తెచ్చుకున్నారని తెలిపారు. ఆదివారం రాత్రి రవితేజ, మహేందర్‌‌లు మిషన్‌ కాంపౌండ్‌ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి అక్కడ మద్యం తాగారు. ఆ తర్వాత ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. మంటలకు శరీరమంతా కాలిపోతున్న సమయంలో ఆ బాధపే తట్టుకోలేక ఇద్దరూ పెద్దగా కేకలు వేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న వారిని హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.