‘జైలవకుశ’ కలెక్షన్స్‌ సునామి

jai-lava-kusa-collections-records-in-overseas-india

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ దక్కించుకోవడంతో కలెక్షన్స్‌ సునామిలా వస్తున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే 75 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిన ఈ చిత్రం మొదటి వారం రోజుల్లో ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూళ్లు చేసి భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టింది. 70 కోట్లకు చేరువలో షేర్‌ కలెక్షన్స్‌ ఉన్నట్లుగా ట్రేడ్‌ పండితుల ద్వారా సమాచారం అందుతుంది. తాజాగా విడుదల అయిన స్పైడర్‌ చిత్రం నెగటివ్‌ టాక్‌ పొందిన నేపథ్యంలో జై లవకుశ చిత్రం మరో వారం పది రోజుల పాటు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయంగా ట్రేడ్‌ విశ్లేషకు చెబుతున్నారు. ఎన్టీఆర్‌ మూడు విభిన్న పాత్రల్లో నటించినందుకు గాను ప్రేక్షకులు సినిమాకు క్యూ కడుతున్నారు.

మొదటి నుండి కూడా ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులందరిలో కూడా అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో పాటు పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకున్న నేపథ్యంలో కలెక్షన్స్‌ సునామిలా వస్తున్నాయి. రికార్డు బ్రేకింగ్‌ కలెక్షన్స్‌తో ఎన్టీఆర్‌ దూసుకు పోతున్నాడు. ఓవర్సీస్‌లో ఇప్పటికే మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసింది. త్వరలోనే రెండు మిలియన్‌ డాలర్లను ఈ సినిమా వసూళ్లు చేసే అవకాశం ఉందని అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ చెబుతున్నాడు. మొత్తానికి జై లవకుశ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో కూడా బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ, రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకు పోతుంది.

నందమూరి బ్రదర్స్‌ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా అవ్వడంతో ఈ సినిమాపై మొదటి నుండి కూడా సినీ వర్గాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ద కనిపించింది. ఇక మూడు పాత్రలు అనగానే అందరు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. మూడు పాత్రలను దర్శకుడు ఎలా బ్యాలన్స్‌ చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. మూడు పాత్రలకు సంబంధించిన మూడు టీజర్‌లు విడుదలైన సమయంలో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మూడు పాత్రలకు సమాన ప్రాతినిధ్యం కల్పించి దర్శకుడు బాబీ అద్బుతంగా స్క్రీన్‌ప్లేను నడిపించాడు. మొత్తంగా సినిమాను ప్రేక్షకులు ఎలా కోరుకున్నారో అలాగే చూపించాడు. అందుకే ఇప్పుడు ఈ కలెక్షన్స్‌ అంటున్నారు.