జియో మరో సంచలన ఆఫర్… 99 కే నెల రోజులపాటు !

Jio announces 99 rupees Recharge for Users

టెలికం రంగంలో అడుగుపెడుతూనే సంచలనాలకి మారు పేరుగా నిలుస్తున్న జియో సంస్థ తన జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సరికొత్త ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ రోజు నుండి మాన్‌సూన్ హంగామా ఆఫర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో జియో సంస్థ తన వినియోగదారుల కోసం రూ.99 రీఛార్జ్ ప్లాన్ ని ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా వినియోగదారులు 14జీబీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్ పొందుతారు. 28 రోజుల కాలపరిమితి గల ఈ ఆఫర్లో రోజుకి 500ఎంబీ డేటాతో పాటు 300 ఉచిత ఎస్‌ఎంఎస్‌ లని పొందుతారు. అలాగే పాత జియోఫోన్ లు ఎక్స్‌చేంజ్ చేసుకునే వాళ్లు రూ.594 రీఛార్జ్ చేసుకుంటే ఆరు నెలలపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితంగా పొందుతారు. అయితే ఇది కేవలం జియో ఫోన్లలో వాడే సిమ్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.