ఇస్రో శాస్త్రవేత్తలకు కర్ణాటక సీఎం సన్మానం..!

Karnataka CM honors ISRO scientists
Karnataka CM honors ISRO scientists

కర్ణాటక సీఎం సిద్దరామయ్య చంద్రయాన్ – 3 సేఫ్ లాండింగ్ విజయవంతంగా పూర్తి కావడంతో గురువారం ఇస్రో చీఫ్ సోమనాథన్ ను సన్మానించారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్నిసిద్ధరామయ్య సందర్శించారు.. సోమనాథన్ కి శాలువా కప్పి సత్కరించారు. సిద్ధరామయ్య చంద్రయాన్ 3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ప్రాజెక్టు శాస్త్రవేత్తలను, సిబ్బందిని అభినందించారు. వారికి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. జాబిల్లిపై కాలు మోపడం చిన్న విషయం కాదని, అది అసాధారణ విజయమని అన్నారు. 500 మంది శాస్త్రవేత్తలు దీనిపై పనిచేశారని చెప్పారు. బెంగళూరులోని విధాన సౌధలో ఇస్రో చైర్మన్ తో సహా శాస్త్రవేత్తలు అందరినీ సన్మానిస్తామని వెల్లడించారు.