అయోమయంలో ‘కరుప్పు’ విడుదల.. కన్నీటితో స్పందించిన దర్శకుడు..!

అయోమయంలో ‘కరుప్పు’ విడుదల.. కన్నీటితో స్పందించిన దర్శకుడు..!
అయోమయంలో ‘కరుప్పు’ విడుదల.. కన్నీటితో స్పందించిన దర్శకుడు..!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం Karuppu (తెలుగులో వీరభద్రుడు) నేడు థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ అనుకోని అడ్డంకులు చివరి నిమిషంలో అడ్డు పడ్డాయి. దర్శకుడు ఆర్జే బాలాజీ  తెరకెక్కించిన ఈ సినిమా, నిర్మాతలకు సంబంధించిన పాత ఆర్థిక బకాయిలు పరిష్కారం కాకపోవడంతో ప్రదర్శన నిలిచిపోయింది. ఫలితంగా ఉదయం, మధ్యాహ్నం షోలు రద్దయ్యాయి. ఈ పరిణామం సూర్య అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది.

ఈ పరిస్థితుల్లో దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. “నిజంగా క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కారమై, ఈ రోజు సాయంత్రం 6 గంటల లోపు సినిమా థియేటర్లలోకి వస్తుందని ఆశిస్తున్నాను” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అయోమయంలో ‘కరుప్పు’ విడుదల.. కన్నీటితో స్పందించిన దర్శకుడు..! - Telugu Bullet

దర్శకుడి వీడియో చూసిన నెటిజన్లు ఆయనకు మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించారు. మరి సాయంత్రానికి అయినా కరుప్పు థియేటర్లలో సందడి చేస్తుందో లేదో వేచి చూడాల్సిందే.