పవన్‌ను రిస్క్‌లో పెట్టిన ముద్దుగుమ్మలు

keerthi suresh and anu emmanuel dubbing for pawan kalyan agnathavasi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఒక స్టార్‌ హీరో సినిమాకు భారీ బడ్జెట్‌ పెడతారు కనుక రిస్క్‌లు చాలా తక్కువ తీసుకుంటారు. అంటే ప్రయోగాలు చేయడం లేదా కొత్తగా ప్రయత్నించడం వంటివి చేయరు. ఎక్కువగా ఇంతకు ముందు వాడిన విధానాన్ని వాడేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తారు. కాని పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాకు మాత్రం వరుసగా ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించే హీరోయిన్స్‌ ఏ ఒక్కరు కూడా స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకోరు. స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్స్‌గా నటించే ముద్దుగుమ్మలు నటించి పక్కకు తప్పుకోవడం, మరో లేడీ డబ్బింగ్‌ చెప్పడం జరుగుతుంది. కాని పవన్‌ సినిమాకు మాత్రం ఇద్దరు హీరోయిన్స్‌ కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు.

 PSPK25-Anu-Emanuel-Dubbing-

వపన్‌ అజ్ఞాతవాసి సినిమాలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్‌ మరియు అనుఎమాన్యూల్‌లు నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే కీర్తి సురేష్‌ ఈ చిత్రం కోసం డబ్బింగ్‌ చెప్పినట్లుగా అధికారికంగా ప్రకటించింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. పవన్‌ కోసం కీర్తి సురేష్‌ డబ్బింగ్‌ చెప్పడంతో చాలా చర్చనీయాంశం అయ్యింది. కీర్తి సురేష్‌కు తెలుగు సరిగా మాట్లాడటం రాదు. అలాంటి సమయంలో ఆమెతో దర్శకుడు త్రివిక్రమ్‌ ఎలా డబ్బింగ్‌ చెప్పించాడు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మరో హీరోయిన్‌ అను ఎమాన్యూల్‌ కూడా పవన్‌ సినిమా కోసం డబ్బింగ్‌ చెప్పింది.

keerthis-uresh--anu-emmanue

పవన్‌ కళ్యాణ్‌ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించిన ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా తెలుగు వారు కాదు. అయినా కూడా వారిద్దరితో తెలుగులో డబ్బింగ్‌ చెప్పించడం అనేది చాలా ప్రత్యేకం అని చెప్పాలి. అను ఎమాన్యూల్‌తో కూడా త్రివిక్రమ్‌ డబ్బింగ్‌ చెప్పించడం పట్ల ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారి పాత్రల తీరుకు వారు సొంతంగ డబ్బింగ్‌ చెప్పుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్‌ భావించాడు కనుక వారితో ఈ పని చేయించినట్లుగా అనిపిస్తుంది. కాని సినీ వర్గాల వారు మాత్రం ఇది ఖచ్చితంగా రిస్క్‌ అంటున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరిలో 10వ తారీకున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.