వచ్చే ఏడాది వరకు పెళ్ళి చేసుకొనని చెప్పిన కీర్తి సురేష్

వచ్చే ఏడాది వరకు పెళ్ళి చేసుకొనని చెప్పిన కీర్తి సురేష్

నేను శైలజ అంటూ… తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మళయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ అంటూ నానితో జతకట్టింది. అయితే ‘మహానటి’తో కీర్తి సురేష్ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు కూడా అందింది. అయితే… ఈ మధ్య కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలెక్కుతుందున్న వార్తలు షికార్లు చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు కుమారుడ్ని ఆమె వివాహం చేసకుంటుందన్న వార్తలు వినిపించాయి. ఇది పెద్దలు నిశ్చయించిన పెళ్లేనంటూ అందరూ చెప్పుకున్నారు. అయితే ఈ వార్తల్ని ఖండించింది దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్‌.. వచ్చే ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చాను. ఇలాంటి పరిస్థితులలో పెళ్ళి ఎలా జరుగుతుంది. దయచేసి అవాస్తవాలని, తప్పుడు వార్తలని ప్రచారం చేయోద్దు అని కోరింది కీర్తి.

గతంలో కూడా కీర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు వినిపించాయి. ఆమె కమెడియన్ సతీష్‌ను పెళ్లి చేసుకుందన్న వార్తలు హల్ చల్ చేశాయి, కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో కూడా ఆ వార్తల్ని కీర్తి సురేష్  ఖండించింది. తనకు ఎలాంటి పెళ్లి జరగలేదని క్లారిటీ ఇచ్చింది. 1992 అక్టోబర్ 17న కీర్తి సురేష్ తమిళనాడులో పుట్టింది. కీర్తి సురేష్ తండ్రి సినీ నిర్మాత, తల్లి మేనక కూడా నటి. 2000 సంవత్సరంలోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కీర్తి సురేష్ తన కెరియర్‌ను స్టార్ట్ చేసింది. ఫైలట్, అచనికిష్టం, కుబేరన్ వంటి సినిమాల్లో బాల నటిగా మెరిసింది.