Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకుండా ఆ రాష్ట్ర ఓటర్లు తీర్పును ఇచ్చిన నేపథ్యంలో బెంగళూరు రాజకీయాలు వేడెక్కాయి. జంప్ జిలానీల గురించి ఆయా పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువ సీట్లు వచ్చిన బీజేపీ… ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాగేందుకు మంతనాలు జరుపుతోంది. ఇప్పటికే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరతీసిందని సమాచారం. బెంగళూరులో ఉన్న ఈగిల్టన్ రిసార్ట్ లో 100 రూములను కాంగ్రెస్ బుక్ చేసినట్టు సమాచారం. రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిసార్టులోనే ఉంచడం కొసమెరుపు.
అయితే కర్ణాటకలో ఎన్నికల ఫలితాలను చుసిన కేరళ పర్యాటకశాఖ. మా రాష్ట్రానికి వచ్చేయండి… ప్రకృతి అందాలను తనివితీరా చూడండంటోంది. అదేంటి వాళ్లకు ఆహ్వానం ఎందుకు ఆహ్వానం పలికిందని షాకవుతున్నారా. అక్కడే ఉంది చిన్న కిటుకు. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ బిజీతో పాటూ… మానసికంగా కూడా ఒత్తిడితో ఉంటారు. వారందరికి ఇదే మా ఆహ్వానం… అందరూ రండి… అందమైన, సురక్షితమైన మా రిసార్ట్స్లో సేద తీరమని ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు పలురకాల కామెంట్లు చేస్తున్నారు.