కోపంతో చేసిన పనికి 3 కోట్లు నష్టం

Lavanya Tripathi fined 3 Crores by Tamil Producers Association

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘అందాలరాక్షసి’ లావణ్య త్రిపాఠి చిక్కుల్లో చిక్కుకుంది. గీతాఆర్ట్స్‌ బ్యానర్‌లో ఈ అమ్మడు విజయ్‌దేవరకొండకు జోడీగా హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల లావణ్యను తొలగించి విజయ్‌ దేవరకొండుకు జోడీగా మరో ముద్దుగుమ్మను ఎంపిక చేయడం జరిగింది. ఉన్నపళంగా తనను తొలగించడం ఏంటని ఆమె గీతాఆర్ట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఒక తమిళ దర్శకుడి వల్ల తనకు ఆ అవకాశం చేజారిందని తెలుసుకుంది. 100%లవ్‌ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసేందుకు సిద్దం అయిన ఆ దర్శకుడు లావణ్య త్రిపాఠిని తమ రీమేక్‌లో హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగింది.

Related image

తమిళ ‘100%లవ్‌’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక అయిన లావణ్య త్రిపాఠి తెలుగులో విజయ్‌దేవరకొండతో ఆ సినిమాను చేయలేదు అంటూ దర్శకుడు చెప్పడంతో గీతాఆర్ట్స్‌ వారు మరో హీరోయిన్‌ను ఎంపిక చేయడం జరిగింది. తనకు తెలియకుండా ఆ సినిమాను చేయలేను అంటూ చెప్పేందుకు నువ్వు ఎవరు అంటూ దర్శకుడిగా లావణ్య త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కోపంలో ‘100%లవ్‌’ చిత్ర రీమేక్‌లో నటించేందుకు నో చెప్పింది. అప్పటికే అడ్వాన్స్‌ తీసుకోవడంతో పాటు, షెడ్యూల్‌ ఖరారు కూడా అయ్యింది. షెడ్యూల్‌ ఖరారు అయిన తర్వాత లావణ్య నో చెప్పడంతో ఆ షెడ్యూల్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాల్సి వచ్చింది.

ఒక షెడ్యూల్‌ మొత్తం క్యాన్సిల్‌ అవ్వడం వల్ల 5 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, వెంటనే ఆ మొత్తంను లావణ్య త్రిపాఠి చెల్లించాల్సిందిగా నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతల మండలి మరియు నడిగర్‌ సంఘంలో ఈ వివాదం రాద్దాంతం అవుతుంది. కోపంతో ఆ సినిమాను వదులుకున్నందుకు కనీసం మూడు కోట్లు అయినా లావణ్య త్రిపాఠి చెల్లించాల్సిన పరిస్థితి దాపరించింది. ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న లావణ్య త్రిపాఠికి ఈ పరిణామం కెరీర్‌లో మచ్చ అని చెప్పక తప్పదు.