వైసీపీలోకి మొదలైన వలసలు

Leaders Alliance With YCP To Make Jagan Chief Minister

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Leaders Alliance With YCP To Make Jagan Chief Minister

ఎన్నికలకు ఏడాదిన్నర ముందే వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే టీడీపీలో ఓవర్ ఫ్లో ఉండటంతో.. కాంగ్రెస్ లో ఉన్న కాస్తో కూస్తో బలమున్న నేతలు జగన్ వైపు చూస్తున్నారు. మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి కూడా త్వరలోనే జగన్ కు జై కొడతారట. రాజకీయ భవిష్యత్తు కోసమే జగన్ పార్టీలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో కందుకూరు మున్సిపల్ ఎన్నికల కారణంగా మానుగుంట వైసీపీలో చేరలేదు. ఇప్పుడు ముందుగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ల ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని సీట్లూ గెలవాలని భావిస్తున్న వైసీపీ.. బలమైన నేత మానుగుంటను చేర్చుకోవాలనుకుంటోంది. ఆయన తప్పకుండా 2019లో కూడా విజయం సాధిస్తారని నమ్మకం పెట్టుకుంటోంది.

కందుకూరు ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలిచినా.. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి మరో మాజీ మంత్రి బాలినేని.. మానుగుంటకు గాలమేశారు. ప్రతి చోటా గెలుపు గుర్రాలను చేరదీసి.. జగన్ ను సీఎం చేయాలని వైసీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. మరి జగన్ ఆశలు ఎంతవరకు నెరవేరతాయో చూడాలి.