మెహబూబాకు కష్ట కాలం

Mahbooba movie gets troubles from Mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కిన ‘మెహబూబా’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ చిత్రంపై దర్శకుడు పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ కథపై నమ్మకంతో మరియు తన కొడుకును స్టార్‌ను చేయాలనే ఉద్దేశ్యంతో భారీ బడ్జెట్‌తో స్వయంగా తానే నిర్మించాడు. పూరి ఈ చిత్ర నిర్మాణం కోసం తన ఇల్లును కూడా అమ్ముకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమే అంటూ స్వయంగా దర్శకుడు పూరి చెప్పుకొచ్చాడు. సినిమా విడుదలైన తర్వాత తప్పకుండా తనకు లాభాలు వస్తాయనే నమ్మకంతో పూరి ఉన్నాడు. కాని పూరి ఆశలపై మహానటి నీళ్లు చల్లింది.

సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక మామూలు విజయాన్ని ఆ సినిమా అందుకుంటుందని అంతా భావించారు. అందుకే రెండు రోజుల గ్యాప్‌లోనే తన మెహబూబా ను విడుదల చేయాలని పూరి భావించాడు. కాని ప్రస్తుతం పరిస్థితి మారింది. మహానటి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అంటూ ట్రేడ్‌ పండితులు అంటున్నారు. ఈ సమయంలో మెహబూబా విడుదల అయితే కలెక్షన్స్‌ రాకపోవగా తీవ్ర నష్టాలు రావడం ఖాయం అంటున్నారు. సినిమా విడుదల నిలిపేయలేక, విడుదల చేస్తే నష్టాలు వస్తాయేమో అనే భయంతో పూరి తెగ టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెహబూబా ఫలితం తారు మారు అయితే కనీసం 5 కోట్ల కలెక్షన్స్‌ కూడా రాకపోవచ్చు అంటున్నారు.