‘2.0’ విడుదల మహేష్‌, బన్నీకి తల నొప్పి

mahesh and allu arjun competing with rajinikanth 2.0 movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రజినీకాంత్‌, శంకర్‌ల కాంబో మూవీ ‘2.0’ సంక్రాంతి నుండి ఏప్రిల్‌కు వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించింది. ఏప్రిల్‌లో 27న విడుదల చేయబోతున్నట్లుగా లైకా ప్రొడక్షన్స్‌ అధికారికంగా వెళ్లడి చేయడంతో తెలుగులో సినిమా పరిశ్రమలో టెన్షన్‌ వాతావరణం మొదలైంది. ఇప్పటికే ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాలు ‘నా పేరు సూర్య’, ‘భరత్‌ అను నేను’ చిత్రాలు ఒకే రోజు అదీ ఏప్రిల్‌ 27న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ ఇద్దరు హీరోలే కొట్టుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మద్యలో రజినీకాంత్‌ రావడంతో అంతా కూడా తలకిందులు అయ్యే పరిస్థితి వచ్చింది.

na-peru-surya-n-illu-india

తెలుగులో రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటనకు ఏప్రిల్‌ 27 వేదిక కాబోతుంది. ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలోనే రజినీకాంత్‌ కూడా అదే రోజు రాబోతున్నాడు అంటూ ప్రకటన రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడటం జరిగింది. బన్నీ సన్నిహితుడు బన్నీ వాసు లైకా ప్రొడక్షన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందే ఇద్దరు స్టార్‌ హీరోల సినిమాలు ఏప్రిల్‌ 27న విడుదల కాబోతున్నట్లుగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఎలా మళ్లీ అదే రోజు మీ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు అంటూ బన్నీ వాసు ప్రశ్నిస్తున్నాడు. మరో వైపు భరత్‌ అను నేను చిత్ర నిర్మాత దానయ్య కూడా తెలుగులో ‘2.0’ చిత్రం విడుదల వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు.

bharath-anu-nenu

రజినీకాంత్‌ ‘2.0’ చిత్రం దేశ వ్యాప్తంగా ఒకే తేదీన విడుదల చేయాల్సి ఉంది. కనుక విడుదల వాయిదా అనేది కష్టం. ఒక్క తెలుగులో విడుదల తేదీని మార్చడం కూడా దాదాపు అసాధ్యం. అందుకే మహేష్‌ లేదా అల్లు అర్జున్‌లలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గాల్సిందే అని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మరి ఇద్దరిలో ఎవరు వెనక్కు తగ్గుతారు, ఎవరు రజినీకాంత్‌తో ఢీ కొడతారు అనేది చూడాలి.