మహేష్‌ రాలేదు ఎందుకో…?

Maheshbabu Not Attend In Nannu Dochukunduvate Pre Release Function

సుధీర్‌ బాబు హీరోగా నటించే ప్రతి సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో మహేష్‌ బాబు కనిపిస్తూనే ఉంటాడు. అయితే తాజాగా సుధీర్‌బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో మాత్రం మహేష్‌బాబు కనిపించక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. మహేష్‌బాబు ఎందుకు ఈసారి బావ సుధీర్‌బాబు కోసం రాలేదు అంటూ సోషల్‌ మీడియాలో మరియు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇద్దరి మద్య విభేదాలు ఏమైనా వచ్చాయా అంటూ కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్‌ సన్నిహితులు ఈ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చాడు.

sudeer

మహేష్‌బాబు ప్రస్తుతం తన 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఆ కారణంగానే ‘నన్ను దోచుకుందువటే’ ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొనలేక పోయాడు. హైదరాబాద్‌లో లేని వ్యక్తి ఎలా ప్రీ రిలీజ్‌ వేడుకకు వస్తాడు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దగా చేసి మరీ చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

mahesh

మరో వైపు సుధీర్‌బాబు తన సినిమాకు మహేష్‌బాబు ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని నమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంతో సుధీర్‌ బాబు మొదటి సారి నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌పై స్పందిస్తూ మహేష్‌బాబు బాగుంది అంటూ ట్వీట్‌ చేశాడు. సినిమా వేడుకకు హాజరు కావాల్సి ఉన్నా కూడా హైదరాబాద్‌లో లేని కారణంగా హాజరు కాలేదు అంటూ సమాచారం అందుతుంది.

maheshbabu-nannudhochukundh