మంచు వారి అమ్మాయికి కోపం వచ్చింది

manchu-lakshmi-gets-trolled-for-her-tweet-on-getting-stuck-in-traffic-jam

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మంచు మోహన్‌బాబు నట వారసురాలిగా తెరంగేట్రం చేసిన మంచు లక్ష్మి బుల్లి తెర, వెండి తెరలపై తనదైన స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసింది. బహుముఖ ప్రగ్ఞాశాలిగా పేరున్న మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఆమె తనకు సంబంధించిన ప్రతి వ్యక్తిగత విషయాన్ని, తన అభిప్రాయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా చెబుతూ వస్తుంది. తాజాగా రాజకీయ నాయకులపై మండి పడుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆమె కోపంకు అర్థం ఉంది. ఆమె దాదాపు గంట సమయం పాటు రోడ్డు మీద ట్రాఫిక్‌ జామ్‌లో ఇరుక్కు పోయింది. అందుకే ఆమెకు అంత కోపం వచ్చింది.

lakshmi manchu

హైదరాబాద్‌ రోడ్ల మీద మరీ దారుణంగా ట్రాఫిక్‌ పెరిగి పోతుందని, దానికి తోడు రాజకీయ నాయకులు ఆ ట్రాఫిక్‌ను మరింతగా పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెట్రో పనులు, వర్షం కారణంగా రోడ్డు మరమత్తులు, రాజకీయ నాయకుల కాన్వాయ్‌ల వల్ల ఎక్కడిక్కక్కడ ట్రాఫిక్‌ జామ్‌లు అవుతున్నాయి. హైటెక్స్‌ సమీపంలో మంచు లక్ష్మి గంటన్నర పాటు ట్రాఫిక్‌లో చిక్కుకు పోయింది. ఆ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. హైటెక్స్‌ సమీపంలో గంటన్నర పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాను, రాజకీయ నాయకులు మాలాగ సాదారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్‌ లేకుండా, భద్రత లేకుండా ప్రయాణం చేయగలరా, వారు మాలాగా చేసినప్పుడు ట్రాఫిక్‌ సమస్యు అంటే ఏంటి అనేది తొస్తుందని మంచు లక్ష్మి ట్వీట్‌ చేసింది. ఆమె ట్వీట్‌కు పెద్ద ఎత్తున ఆమె ఫాలోవర్స్‌ మద్దతు పలకడంతో పాటు, ఆమె ట్వీట్‌ను షేర్‌ చేశారు.