సోషల్‌ మీడియా సౌత్‌ కింగ్‌

Allu Arjun NSNI Poster Impact

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
సినిమా పరిశ్రమ వారు ఈమద్య సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్‌ మీడియాలో తమ సినిమాల విశేషాలను మరియు తమ వ్యక్తిగత విషయాలను షేర్‌ చేసుకుంటూ సెలబ్రెటీలు అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ చేసే ప్రతి ట్వీట్‌ కూడా కోట్లాది మందిని రీచ్‌ అవుతూ ఉంటుంది. ఇక సౌత్‌ హీరోలు ఆ విషయంలో కాస్త వెనుకబడి ఉంటారనే విషయం ఒప్పుకోవాల్సిందే. అయితే అల్లు అర్జున్‌ మాత్రం సౌత్‌ హీరోల్లో సోషల్‌ మీడియా విషయంలో నెం.1 స్థానంలో ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన నటించిన సినిమాలు యూట్యూబ్‌లో, ఈయన పోస్ట్‌లు ట్విట్టర్‌ మరియు ఫేస్‌బుక్‌లో తెగ వైరల్‌ అవుతూ ఉంటాయి.

తాజాగా అల్లు అర్జున్‌ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఫస్ట్‌ ఇంపాక్ట్‌ పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్‌పై ట్విట్టర్‌లో భారీ ఎత్తున ట్రెడ్‌ నడిచింది. ఏకంగా మిలియన్‌ ట్వీట్స్‌ నమోదు అయ్యాయి. కేవలం 24 గంటల్లో ఈస్థాయి ట్వీట్స్‌ నమోదు అవ్వడం అందరికి షాకింగ్‌గా మారింది. సౌత్‌లో ఇప్పటి వరకు ఇలాంటి ట్రెండ్‌ నడిచింది లేదు. అల్లు అర్జున్‌ స్థాయి ఈ ట్రెండ్స్‌తో ఏంటో తేలిపోయింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయబోతున్నారు. ఏప్రిల్‌లో సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించబోతున్న విషయం తెల్సిందే. సోషల్‌ మీడియాలో ఈ సినిమా ట్రెండ్స్‌ను చూస్తుంటే సినిమా సునాయాసంగా 100 కోట్లను కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తోంది.