ప్లీజ్‌… మానుతున్న గాయంను రెట్టించొద్దు

Mumaith Khan Fires On Media over Drugs Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌ సినీ ప్రముఖులను డ్రగ్స్‌ విషయం ఏ స్థాయిలో భయాందోళనకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందు విచారణకు హాజరు అయ్యారు. ఎన్టీఆర్‌ నిర్వహించిన బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్న ముద్దుగుమ్మ ముమైత్‌ ఖాన్‌ కూడా డ్రగ్స్‌ కేసులో ఉండటంతో ఆమె బయటకు వచ్చి విచారణ ఎదుర్కొని వెళ్లారు. డ్రగ్స్‌ కేసు ప్రస్తుతం విచారణ కొనసాగుతూనే ఉంది. ఇటీవలే కొందరు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా వెళ్లడైందని పోలీసు వర్గాల వారు ప్రకటించారు. డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా నిరూపితం అయిన వారికి శిక్ష తప్పదని భావిస్తున్న తరుణంలో ముమైత్‌ ఖాన్‌ మీడియా ముందుక వచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా పలు విషయాల గురించి మాట్లాడిన ముమైత్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసు విషయంలో మాత్రం స్పందించేందుకు నో చెప్పింది. ఆ విషయాన్ని గురించి ఇప్పుడిప్పుడే మర్చి పోయేందుకు ప్రయత్నిస్తున్నాను. దయచేసి మానుతున్న గాయంను మళ్లీ రెట్టించొద్దు అంటూ తనదైన శైలిలో యాంకర్‌ను కోరిందట. యాంకర్‌ మళ్లీ అందుకు సంబంధించిన ప్రశ్న వేయడంతో ముమైత్‌కు కోపం వచ్చి అరిచిందని, ఇంటర్వ్యూ మద్యలో వెళ్లి పోబోయింది అంటూ సమాచారం అందుతుంది.

డ్రగ్స్‌ కేసుతో ఖచ్చితంగా ముమైత్‌కు సంబంధం ఉందని సినీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ముమైత్‌ తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను అనవసరంగా ఇరికించారు అంటూ వాదించడంతో పాటు, ఆ విషయాన్ని మళ్లీ రెట్టించవద్దని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మీడియా వారు ఆ విషయాన్ని మర్చిపోయినా పోలీసు వారు ఆ కేసు విచారణ జరుపుతున్నారు అనే విషయంను ముమైత్‌ గుర్తుంచుకోవాలి అంటూ కొందరు సూచిస్తున్నారు.