ఎవడో దరిద్రుడి పుకార్లు : నాగబాబు

Naga Babu Serious On Sai Dharam Tej Niharika Marriage Rumours

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యామిలీ హీరోలకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా వారి గురించి ఎప్పుడు ఏదో ఒక పుకారు సోషల్‌ మీడియాలో షికారు చేస్తూనే ఉంటుంది. ఇటీవల మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోయిన్‌ రెజీనాను వివాహం చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వచ్చే సంవత్సరం వీరిద్దరి వివాహం వైభవంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తల గురించి పక్కన పెడితే అంతకు ముందు సాయిధరమ్‌ తేజ్‌కు రెండవ మేనమామ నాగబాబు కూతురు నిహారికకు వివాహం జరుగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి, ఇద్దరు బావ మరదల్లు అవ్వడంతో పాటు, ఇరు కుటుంబాలు కలవాలనే ఉద్దేశ్యంతో పెళ్లికి పెద్దలు సిద్దం అవుతున్నారని ప్రచారం జరిగింది.

ఆ వార్తలను నిహారిక మరియు సాయి ధరమ్‌ తేజ్‌లు కొట్టి పారేశారు. ఇప్పుడు ఆ వార్తలపై మెగా బ్రదర్‌ నాగబాబు చాలా సీరియస్‌ అయ్యాడు. ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ తన కూతురు గురించి వచ్చిన వార్తలపై స్పందించాడు. నిహారిక, తేజూలు అన్న చెల్లి మాదిరిగా ఉంటారు. వారిద్దరు ఎప్పుడు తప్పుడు ఉద్దేశ్యంలో ఆలోచించలేదు. వరుణ్‌తో ఎలా అయితే నిహా ఉంటుందో అలాగే తేజూతో కూడా ఉంటుంది. ఎవడో దరిద్రుడు పని పాట లేని వాడు సోషల్‌ మీడియాలో ఇలాంటి రాతలు రాస్తున్నారు అంటూ నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా రెజీనాతో తేజూ వివాహాన్ని కూడా నాగబాబు కొట్టి పారేశాడు. వాడు చిన్నపిల్లాడు ఇంకా కెరీర్‌ చాలా ఉంది, పెళ్లి ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.