నాగార్జున అతి జాగ్రత్త కొంప ముంచిందా?

Nagarjuna over involvement on Akhil Hello

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ మొదటి చిత్రం ‘అఖిల్‌’ తీవ్రంగా నిరాశ పర్చిన విషయం తెల్సిందే. వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ ఆ చిత్రాన్ని నిర్మించాడు. వారిపై నమ్మకం పెట్టి తప్పు చేశాను అని, తన కొడుకు సినిమాను తానే నిర్మించి ఉంటే బాగుండు అంటూ అఖిల్‌ రెండవ సినిమా బాధ్యతను నాగార్జున పూర్తిగా తన భుజాలపై వేసుకున్నాడు. నిర్మాణంలో వెనుకాడకుండా ఏకంగా 40 కోట్లు ఖర్చు చేసి విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాగార్జున అఖిల్‌ రెండవ చిత్రం ‘హలో’ను నిర్మించాడు. అన్ని విషయాల్లో రిచ్‌గా ఉండాలని నాగార్జున తాపత్రయ పడ్డాడు. ప్రతి విషయంలో కూడా నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని నిర్మాణంను దగ్గరుండి చూసుకున్నాడు.

కొన్ని సీన్స్‌లలో నాగార్జున ఇన్వాల్వ్‌మెంట్‌ కూడా ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. నాగార్జున అతి చేస్తున్నాడని, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ చిరాకు పడుతున్నాడు అంటూ కూడా ఆ మద్య వార్తలు వచ్చాయి. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ మాత్రం ఆ వార్తలు కొట్టి పారేశాడు. ఇక అఖిల్‌ రెండవ చిత్రం హలో కోసం నాగార్జున ప్రతి విషయంలో అతి జాగ్రత్తను తీసుకున్నాడు. ఒక విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచించాడు. అందుకే ఈ చిత్రం ఫలితం తారు మారు అయ్యిందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఏదైనా ఒక మోస్తరు వరకు ఓకే, కాని అతి చేస్తే అసహ్యం అవుతుందనే విషయం తెల్సిందే. అలాగే హలో విషయంలో కూడా నాగార్జున అతి జాగ్రత్త కొంప ముంచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అఖిల్‌ ఈ చిత్రం ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా సమాచారం అందుతుంది.