దాన్ని నమ్మొద్దన్న నాగ్‌

nagarjuna says about akhil new movie heroine

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అఖిల్‌ రెండవ సినిమా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో అక్కినేని నాగార్జున ప్రతిష్టాత్మకంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్‌కు ఈ సినిమా సక్సెస్‌ ఖచ్చితంగా అవసరం. అందుకే నాగార్జున ప్రత్యేక శ్రద్ద తీసుకుని, ఒక మంచి కథతో అఖిల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్‌ ఎంపిక మాత్రం జరగలేదు. పలువురు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ పేర్లు పరిశీలించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే అఖిల్‌కు జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

బాలీవుడ్‌ మీడియాలో కూడా శ్రీదేవి కూతురు తెలుగులో అఖిల్‌కు జోడీగా నటించనుంది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగార్జున క్లారిటీ ఇచ్చాడు. అఖిల్‌కు జోడీగా ఖుషీ నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇంకా అఖిల్‌ రెండవ సినిమా హీరోయిన్‌ ఫిక్స్‌ కాలేదని చెప్పుకొచ్చాడు. హీరోయిన్‌ ఎంపిక విషయమై త్వరలోనే విక్రమ్‌ ఒక నిర్ణయం తీసుకుంటాడని తాను భావిస్తున్నట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. అఖిల్‌కు మొదటి చిత్రంలో హీరోయిన్‌గా సాయేషా సైగల్‌ నటించింది. ఆమె వల్ల పెద్దగా ప్రయోజనం కగలేదు. అందుకే ఈసారి ప్రస్తుతం అందరికి తెలిసిన హీరోయిన్‌నే తీసుకునే అవకాశం కనిపిస్తుంది.