మేం నటిస్తే ఎవ్వరూ చూడరు…!

Nagarjuna Shocking Comments On Tollywood Senior Heros

టాలీవుడ్‌లో ఈమద్య వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్న విషయం తెల్సిందే. మల్టీస్టారర్‌ చిత్రాల కోసం మొహం వాచినట్లుగా గత మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వెంకటేష్‌ మరియు మహేష్‌ బాబులు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో మల్టీస్టారర్‌లు ప్రారంభం అయ్యాయి. తాజాగా నాగార్జున నాని కలిసి నటించిన ‘దేవదాస్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. నాగార్జున గతంలో కార్తీతో కలిసి ‘ఊపిరి’ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఇకపై వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తానంటూ ప్రకటించిన నాగార్జున సీనియర్‌ హీరోలతో మాత్రం నటించేది లేదు అంటూ తేల్చి చెప్పాడు.

nagarjuna

చిరంజీవి, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో మీరు సినిమాలు చేస్తారా, వారితో కలిసి నటించేందుకు మీకు ఆసక్తి ఉందా అంటూ మీడియా వారు ప్రశ్నించిన సమయంలో.. వెంకటేష్‌తో కలిసి నటించేందుకు చాలా సార్లు ప్రతిపాధన వచ్చింది. కాని సీనియర్‌ హీరోలం కలిసి నటిస్తే మొసలివాళ్ల సినిమా అంటూ ప్రేక్షకులు నిరాశ పడే అవకాశం ఉంది. అందుకే సీనియర్‌ హీరోలతో సినిమాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. మేం కలిసి నటిస్తే ఎవరు నటించరని, అందుకే తాము నటించాలని భావించడం లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ‘దేవదాస్‌’ చిత్రం తర్వాత తమిళ హీరో ధనుష్‌తో కలిసి మరో మల్టీస్టారర్‌ చిత్రాన్ని కూడా నాగార్జున చేయబోతున్న విషయం తెల్సిందే.

nagarjuna-speech