ఏడుస్తూ ఐ హేట్‌ యు బిగ్‌బాస్‌ అన్న నందిని

nandini rai emotional in Bigg boss season 2

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో నందిని రాయ్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ప్రవేవశించిన విషయం తెల్సిందే. నందిని రాయ్‌ వచ్చిన మొదటి వారం రోజులు ఎవరితో కలవకుండా, అందరికి దూరంగా ఉంటూ పెద్దగా యాక్టివ్‌గా లేకుండా ఉన్నదా లేదా అన్నట్లుగా ఉంది. అదే విషయాన్ని నాని చెప్పుకొచ్చాడు. అందరితో కలవడం లేదు, అందరిలో ఉండటం లేదు, గోడల్లో, సోఫాల్లో కలిసి ఉంటున్నావు అంటూ చెప్పడంతో నందిని కాస్త నొచ్చుకుంది. ఆ తర్వాత నుండి నందిని కాస్త యాక్టివ్‌గానే ఉంటూ ఉంది. తాజాగా బిగ్‌బాస్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించి ఆకట్టుకుంది. బిగ్‌బాస్‌ తాజాగా లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో భాగంగా కొన్ని వ్యాఖ్యాలను పంపడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఎవరికి అయితే సూట్‌ అవుతాయి అనేది ఇంటి సభ్యులు చెప్పాలి.

బిగ్‌బాస్‌ పంపిన కార్డ్‌లో మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటూ ఉంది. అది ఎవరికి వర్తిస్తుంది అంటూ అడిగిన వెంటనే అంతా కూడా నందిని రాయ్‌ను చూపించారు. నందిని రాయ్‌ ఆన్సర్‌ చెప్పిన వెంటనే బిగ్‌బాస్‌ కూడా కరెక్ట్‌ అంటూ చెప్పాడు. దాంతో నందిని రాయ్‌ మొహంలో రక్తం లేకుండా పోయింది. ఇతర సభ్యుల గురించి కూడా కాస్త నెగటివ్‌గా వచ్చింది, కాని మరీ నందిని రాయ్‌ విషయంలో చాలా దారుణమైన వ్యాఖ్య రావడంతో ఆమె బాగా ఏడ్చేసింది. ఇంటి సభ్యులు అంతా కూడా ఓదార్చినా ఆమె ఏడుపు ఆపుకోలేక పోయింది. బిగ్‌బాస్‌ ఐ హేట్‌ యు అంటూ నందిని రాయ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర సభ్యులు తమకు కూడా బ్యాడ్‌ సెంటెన్స్‌ వచ్చాయి. అయినా మేము ఏమాత్రం నొచ్చుకోలేదు కదా అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో నందినిరాయ్‌ పరువు పోయింది.