షాక్… అత్తారింటికెళ్తూ.. చంబల్ నదిలో దూకేసిన నవ వధువు

ఈతకి వెళ్లి ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాత

మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. అదేమంటే.. అప్పుడే వివాహం చేసుకున్న ఓ యువతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివాహం అయిన వెంటనే అత్తారింటి వెళ్తున్న సమయంలో వాంతి వస్తుందని చెప్పి వాహనాన్ని ఆపించి మరీ తాను చంబల్ నదిలో దీకేసింది. ఈ ఘటన చూసి అంతా షాక్ అయ్యారు.

అయితే మధ్యప్రదేశ్ లోని భోపాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళ్తే… ఆదివారం రోజు రాజస్థాన్ కు చెందిన అలాపుర్ యువతికి వివాహమైంది. అయితే అమ్మాయిని అత్తారింటికి పంపే వేడుక కూడా ఘనంగా జరిగింది. తన భర్త, అత్తమామలతో కలిసి మధ్యప్రదేశ్ కు ఆమె బయలుదేరింది. షియోపూర్ చంబల్ నదిపై వాహనం వెళుతున్న సమయంలో ఆమె తనకు వాంతి వస్తోందని చెప్పింది. కారును ఆపాలని కోరింది. ఆ వెంటనే డ్రైవర్ ఆపకుండా పోతుంటే, స్టీరింగ్ ను గట్టిగా పట్టుకోవడంతో, డ్రైవర్ బ్రేకులు వేశాడు. దీంతో వెంటనే వాహనం ఆగింది.

 అదే సమయంలో వెంటనే ఆ వాహనాన్ని దిగిన ఆమె, వాహనంలోని భర్త, ఇతరులకు ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే చంబల్ నదిలో దూకేసింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా రాత్రి పెళ్లయిన తర్వాత కూడా ఆమె బాగానే ఉందని.. ఇంతలోనే ఏమైందో తమకు అర్థం కావడం లేదని వధువు తండ్రి వాపోయాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.