జక్కన్న మల్టీస్టారర్‌ మరో అప్‌డేట్‌

NTR and Charan playing boxers in rajamouli upcoming film

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాజమౌళి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌, చరణ్‌ల ఫొటో ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జక్కన్న మద్యలో ఉండి ఎన్టీఆర్‌, చరణ్‌లు చొరోవైపు ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో విడుదల చేయగానే అంతా కూడా సరదాగా దిగిన ఫొటో అనుకున్నారు. అయితే మల్టీస్టారర్‌ చిత్రం అంటూ ఆ తర్వాత వెళ్లడైంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రానప్పటికి జరుగుతున్న పరిణామాలు మరియు మెగా మరియు నందమూరి వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మల్టీస్టారర్‌ చిత్రం అని తేలిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, చరణ్‌లు అన్నదమ్ముళ్లుగా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఈ చిత్రం గురించి చక్కర్లు కొడుతోంది.

ఈ మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌లు బాక్సర్‌లుగా కనిపించబోతున్నారట. వీరిద్దరు కూడా బాక్సింగ్‌లు ఛాంపియన్స్‌ అవుతారని, ఇద్దరి మద్య కూడా కొన్ని బాక్సింగ్‌ సీన్స్‌ ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్‌ సిద్దం అయ్యింది. దాన్ని దర్శకుడు రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా సిద్దం చేస్తున్నాడు. ఫిబ్రవరి నుండి స్క్రిప్ట్‌ పనుల్లో చరణ్‌, ఎన్టీఆర్‌లు కూడా పాల్గొంటారని సమాచారం అందుతుంది. ఇక ఈ చిత్రానికి ‘యమధీర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. 150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దానయ్య సన్నాహాలు చేస్తున్నాడు. రాజమౌళి నోటి నుండి ఇప్పటి వరకు ఒక్క మాట రాలేదు. కాని అప్పుడే ఎన్నో రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లలో ఏది నిజం, ఏది అబ్దం అనేది ఎవరో ఒకరు అధికారికంగా ప్రకటిస్తే కాని తెలియదు.